చూడడమనే కళ 9th Class Telugu Lesson & Important Question & Answers

చదవండి – ఆలోచించండి-చెప్పండి

పూర్వం ఒక రాజుగారికి ఇద్దరు మంత్రులు ఉండేవారు. రాజు అన్ని విషయాల్లో పెద్దమంత్రినే సలహా అడిగేవాడు. అది చిన్నమంత్రికి నచ్చేది కాదు. అతనికి పెద్దమంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. ఒకరోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్న మంత్రితో రాజు అన్నాడు. చూసివచ్చి ‘కుక్క ఈనిం దన్నాడు చిన్నమంత్రి. పిల్లలెన్ని’ అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి ‘నాలుగు ఏ రంగులో అన్నాడు. ఉన్నాయన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళివచ్చి రెండు నలుపూ, రెండు గోధుమరంగు’లో ఉన్నాయన్నాడు. ఇంతలో పెద్దమంత్రి వచ్చాడు. అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి, రాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చాడు. పెద్దమంత్రి గొప్పతనం అర్థమైన చిన్న మంత్రి సిగ్గుపడ్డాడు.

ప్రశ్నలు – జవాబులు

1. చిన్నమంత్రి ఒక్కొక్కసారి ఒక సమాధానాన్నే ఎందుకు చెప్పాడు ?

జ. చిన్నమంత్రి విషయాన్ని పూర్తిగా పరిశీలించి చూడడం, అనే కళ తెలిసినవాడు కాడు. కేవలము, రాజు తనను అడిగిన విషయాన్ని మాత్రమే చూచి వచ్చి, అడిగిన ఆ ఒక్కొక్క ప్రశ్నకే, సమాధానాన్ని చెప్పగలిగాడు.

2. పెద్దమంత్రి ఒకేసారి అన్ని విషయాలు చెప్పడానికి కారణమేమిటి?

జ. పెద్దమంత్రి దగ్గర విషయాన్ని సంపూర్తిగా పరిశీలించి చూడడమూ, విషయాలు అన్నీ తెలిసికోవడమూ అనే కళ ఉంది. కాబట్టి రాజు తనను చూచి రమ్మన్నపుడు విషయాన్ని అంతా పరిశీలించి వచ్చి, అన్ని విషయాలూ చెప్పగలిగాడు.

3. ఇద్దరిలో పరిశీలనా శక్తి ఎవరికి ఎక్కువగా ఉంది ?

జ. మంత్రులు ఇద్దరిలో పెద్దమంత్రికి పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంది.

4. మనం వేటి వేటిని జాగ్రత్తగా పరిశీలించాలి? ఎందుకు?

జ. మనం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా పరిశీలించాలి. విషయం పట్ల శ్రద్ధ చూపాలి. మనం చూసిన దాన్ని గురించి ఎవరు ఏమడిగినా దాన్ని గూర్చి వివరంగా చెప్పగలగాలి.

పాఠ్యభాగ ఉద్దేశం

వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపించడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేయడమే, ఈ పాఠ్యాంశం ఉద్దేశం.

కవి పరిచయం

  • రచయిత పేరు: జిడ్డు కృష్ణమూర్తి
  • పాఠ్యభాగం పేరు: ‘చూడడమనే కళ
  • రచయిత జననం: మే 12, 1895.
  • జన్మస్థలం: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా “మదనపల్లె”
  • రచనలు: కృష్ణమూర్తిగారు ఆంగ్లభాషలో 1) ధ్యానం 2) స్వేచ్ఛ 3) నీవే ప్రపంచం 4) గరుడయానం మొదలయిన రచనలు చేశారు.
  • ప్రతిభ:  కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త.

రచనల సారాంశం: మనిషి తనకు తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలని వీరు బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు.

ఇవి చేయండి

1. అవగాహన – ప్రతిస్పందన

అ) కింది అంశాల ఆధారంగా మాట్లాడండి.

1. సూర్యోదయ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉంటుంది ?

జ. సూర్యోదయ సమయంలో పక్షులు కలకల ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఆవులూ, దూడలూ అంభా అని అరుస్తూ ఉంటాయి. పూలు వికసించి పరిమళిస్తూ ఉంటాయి. నిద్ర నుండి మనుషులు లేచి తమ తమ పనులకోసం సిద్ధం అవుతూ ఉంటారు. కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటారు. రైతులు పొలాలకు వెడుతూ ఉంటారు. జంతువులు నిద్ర నుండి లేస్తాయి. మంచు తెరలు తెరలుగా విడిపోతుంది. సూర్యకిరణాలు వెచ్చవెచ్చగా వ్యాపిస్తాయి.

2 శ్రద్ధ చూపడం అంటే ఏమిటి?

జ. శ్రద్ధ చూపడం అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండటం. శ్రద్ధ అంటే, ప్రేమ అనే దానిలో ఒక లోతైన భాగం. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంతో ఇది ప్రారంభం అవుతుంది. శ్రద్ధ చూపడం అంటే పెంపుడు జంతువును బాగా చూడడం, బట్టల్ని శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రంగా స్నానం మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మీరు పాతిన మొక్కకు నీరు పోసి, ఎరువు వేసి చక్కగా పెంచడం, మీరు పెంచుకొనే కుక్కకు సరైన ఆహారాన్ని ఇచ్చి, దాన్ని ఆరోగ్యంగా పెంచడం వంటి పనులు.

3. ఎలా వినాలి? ఎలా మాట్లాడాలి?

జ. పరిశీలించడం, వినడం అన్న పనులు రెండూ, నిజానికి ఒకటే. ఇదంతా ఒకేపని కాబట్టి మనచుట్టూ ఉన్నవాటిని గురించి తెలిసికోవాలి. ఆ పని మనల్ని సున్నితంగా చేస్తుంది. మనం పరిశీలిస్తే, వింటే, అప్పుడు తక్షణమే క్రియ జరుగుతుంది. పరిశీలించినప్పుడే, విన్నప్పుడే చర్య తీసుకుంటారు. వినడం ఎలాగో తెలిస్తే, ఉన్న దాన్నంతటినీ మీరు గ్రహిస్తారు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుకమీదనే ఉన్నదని అర్థం అవుతుంది. వినడంపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

ఆ) కింది వాక్యాలు సాఠ్యాంశంలో ఎక్కడ వచ్చాయో గుర్తించి వాటి భావం రాయండి

1. బిడ్డను ప్రేమించడం అంటే, ఆ బాబు, పాప సరియిన విద్యను పొందేటట్లు చూడడం,

జ. ఈ వాక్యం, మా పాఠ్యాంశంలో ఎక్కడా లేదు.

2. పరిశీలించకపోతే మీరు ‘ప్రజ్ఞావంతంగా ఉండలేరు.

జ. మనం, మన చుట్టూ ఉన్న పక్షుల్నీ, చెట్లనూ, బీదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయం లేని ఆవులనూ, ఆకలితో అల్బుతం ఉన్న కుక్కల్నీ పరిశీలించాలనీ, లేకపోతే మనం ప్రజ్ఞావంతంగా అంటే తెలివిగలవారుగా ఉండలేమని రచయిత చెప్పిన సందర్భంలోనిది.

3. “ప్రతిదాన్నీ ఉన్నది ఉన్నట్లుగా చూడడం ఒక కళ”.

జ. లెక్కలు, చరిత్ర, భూగోళశాస్త్రం నేర్చుకోవడం ఎంత కష్టమో, ఉన్నవాటిని ఉన్నట్లుగా చూడడం కూడా అంతే కష్టం అనీ, ప్రతి వస్తువునూ ఉన్నదానిని ఉన్నట్లుగా చూడడం అనేది, ఒక విద్య అనీ, రచయిత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన సందర్భంలోది.

4. ‘నా అంతట నేనే తెలుసుకోబోతున్నాను’ అని చెప్పే సమయం మీకుండదు.

జ. మనం ఎవరో ఒకరు చెప్పింది వినడానికి అలవాటు పడిపోయాము. మనకు తల్లిదండ్రులూ, గురువులూ, పత్రికలూ, రేడియోలూ, టీవీలు చెపుతూ ఉంటాయి. అలా ఇతరులు చెప్పింది వినడమే కాని, మనంతట మనం తెలుసుకోబోతున్నామని చెప్పే సమయం మనకు ఉండదని రచయిత చెప్పిన సందర్భంలోని వాక్యమిది.

5. ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదు.

జ. స్విట్జర్లాండులో ఒక అమ్మాయి తాను సైకిలు మీద వెడుతూ, అకస్మాత్తుగా సైకిలు దిగి, రోడ్డుమీద ఉన్న కాగితం ముక్కను తీసి దగ్గరగా ఉన్న చెత్తకుండీలో వేసిందనీ, ఆ చిన్నపాపకు అలా చేయమని ఎవరూ చెప్పలేదనీ, రచయిత స్విట్జర్లాండులో మిత్రునితో పాటు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటనను గూర్చి చెప్పిన సందర్భంలోది.

ఇ) కింది పేరాను చదవండి. సమాధానాలు రాయండి.

సర్ జగదీశ్ చంద్రబోస్ బెంగాల్ లోని విక్రంపూర్ అనే గ్రామంలో 1858 నవంబరు 30న జన్మించారు. మొక్కల మీదా, జంతువుల మీదా గాఢమై�

1. వ్యక్తికరణ సృజనాత్మకత

6) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

1. ఎవరయినా దేన్నయినా నిజంగా పట్టించుకుంటున్నారో, ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద ప్రదర్శిస్తున్నారో, మనం చూస్తూ తెలుసుకోవచ్చు అని జిడ్డు కృష్ణమూర్తిగారు, అన్నారు. తెచ్చిపెట్టుకున్న మర్యాద అంటే ఏమిటి?

జ. తెచ్చి పెట్టుకున్న మర్యాద అంటే కృత్రిమ మర్యాద. మనస్సులోపల ఎదుటివారిపై గౌరవం లేకపోయినా, పైకి చిరునవ్వు చిందిస్తూ, ఎదుటివారిని గౌరవించడం, వారికి మర్యాదచేయడం వంటి పనులను తెచ్చి పెట్టుకున్న మర్యాద అని అంటారు. సాధువులూ, సన్యాసులూ వంటి వారికి మంత్రులు స్వాగత సత్కారాలు చేయడం, మగ పెళ్ళి వారికి ఇది పెళ్ళివారు చేసే మర్యాదలూ తెచ్చి పెట్టుకొన్న మర్యాదలే. అత్తవారిపై మనస్సులో ప్రేమ గౌరవాలు లేకపోయినా, కొత్త కోడలు ఉన్నట్లు నటించడాన్ని, తెచ్చి పెట్టుకొన్న మర్యాద అంటారు.

2. పరిశీలనకు, ప్రజ్ఞకు గల సంబంధాన్ని తెలపండి. (లేదా) పరిశీలన, ప్రజ్ఞ ఒకదానికొకటి విడదీయలేనివనే విషయం వివరించండి.

జ. మన చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ, అంటే పక్షుల్నీ, చెట్లనూ, పేదవారినీ, మురికి రోడ్లనూ, ఆశ్రయంలేని,ఆవులనూ, ఆకలితో, జబ్బుతో ఉన్న కుక్కల్నీ బాగా పరిశీలించాలి. అలా పరిశీలించకపోతే, ప్రజ్ఞ కలవారిగా ఉండలేము. అలా చుట్టూ ఉన్నవాటిని పరిశీలించకపోతే, హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు. జీవితంలో ప్రతిదాన్నీ ఊరకే గమనించాలి. గమనింపులో నుండి ప్రజ్ఞ ఉదయిస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే తత్త్వం, మతం వంటివాటికి సంబంధించిన గ్రంధాలు చదవనవసరం లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే, అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుక మీదనే ఉన్నదని అర్ధం అవుతుంది.

3. ‘వల్లించడం అంటే ఏమిటి ? అది విద్యార్థికి ఉపయోగపడుతుందా ? కాదా ? ఎందువల్ల?

జ. ‘వల్లించడం’ అంటే నోటికి వచ్చేలా, వేదాలు మొదలయిన వాటిని, మరలా

3. ఆ) కింది ప్రశ్నలకు పదిహేనేసి నాక్యాల్లో సమాధానాలు రాయండి.

1. జీవితంలో క్రమశిక్షణ అవసరం, ఎందుకో వివరించండి. (లేదా) క్రమశిక్షణ గురించి అడ్డు కృష్ణమూర్తిగారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ? వివరించండి. (లేదా) క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నాన వంటిది. ఈ అంశాన్ని సమర్థిస్తూ క్రమశిక్షణ అవశ్యకతను విశ్లేషిస్తూ రాయండి

జ. క్రమశిక్షణ అంటే ప్రతి పనినీ, సక్రమమయిన పద్ధతిలో సకాలంలో నెరవేర్చడం. పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవనీయులు పట్ల వినయ విధేయతలు కలిగియుండడం. జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి నిద్రించే వరకూ చేయవలసిన పనులను, వేళతప్పకుండా చేయడం క్రమశిక్షణ, మన శరీరానికి అవసరమయిన పోషకపదార్థాలను అందించే ఆహార పదార్థాలను సరయిన రీతిలో తినడం కూడా క్రమశిక్షణయే. క్రమశిక్షణ లేని జీవితము చుక్కాని లేని పడవ వంటిది. క్రమశిక్షణ అనే పేరుతో బలవంతంగా పనులు చేయరాదు. స్వతస్సిద్ధంగా ఒత్తిడి లేకుండా పనులు చేయాలి. అప్పుడే ఒక క్రమత, సమన్వయత, ఒక క్రమశిక్షణ సంభవిస్తుంది. జీవితంలో క్రమశిక్షణగా పాఠాలు చదవాలి. ఇంటి పని పూర్తిచేయాలి. ఏ వృత్తిలో ఉన్నవారయినా సరే, క్రమశిక్షణగా వారి వృత్తిధర్మాలను పూర్తిచేయాలి. అప్పుడే జీవితంలో మంచి ఫలితాలు సాధింపవచ్చు. క్రమశిక్షణగా, వ్యాయామం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఆటలు ఆడితే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివితే విద్యార్థులు విజయం సాధిస్తారు. క్రమశిక్షణగా పొదుపు చేస్తే వారు ధనవంతులవుతారు. వారికి డబ్బు చిక్కులు రావు. జీవితంలో క్రమశిక్షణ పాటించిన వారు ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగిస్తే చక్కని విజయాన్ని సొంతం చేసుకుంటారు.

2 ప్రపంచంలో శాంతి ఉండాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయం రాయండి.

జ. ప్రపంచంలో శాంతి ఉండాలంటే, ప్రజలు తమలో తాము శాంతిగా ఉండాలి.

3. చిన్నతనంలో ఉన్న ఊహాశక్తి, పెద్దవారవుతున్న కొద్దీ ఎందుకు పోతుంది ? ఆలోచించి రాయండి.

జ. ఆ చిన్నతనంలో మానవులలో అసాధారణమైన ఊహాశక్తి ఉంటుంది. మనిషి పెరుగుతున్న కొద్దీ, ఆ శక్తి పోతుంది. చిన్నతనంలో నదిని చూస్తూ ఉంటే, ఆ నదిలోని పడవలో మనం ఉన్నట్లు, భయంకర తుపానుల మధ్య ఆ పడవ చిక్కుకున్నట్లు ఊహిస్తాము. మేఘాన్ని మనం చూస్తే, మనకు అది మేడలా కన్పిస్తుంది. ఆ మేగలో మనం ఉన్నట్లు భావిస్తాము. గాలి శబ్దం వింటే, సంగీతాన్ని విన్నట్లు భావిస్తాము. ఒక పెద్ద పక్షిని చూస్తే, మనం దానివీపుపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్లు తలపోస్తాము. అలాగే మనకు బాగా డబ్బు ఉన్నట్టూ, మంచి పేరు ఉన్నట్లూ, అందరూ మెచ్చుకొనే అద్భుతమైన వ్యక్తి మనం అన్నట్లు, మనం భావిస్తాము. మనం ఏదైనా చరిత్ర చదివితే, దాన్ని గూర్చి ఆలోచించేటప్పుడు ఏవేవో కల్పించుకొని ఊహిస్తాము. పెద్దవారయిన కొద్దీ మన కలలూ, ఊహలూ ఆవిరి అవుతాయి. జీవిత యథార్థ దృశ్యం, మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది. చిన్నప్పుడు మనం మహారాజు కావాలనీ, మహారాజు అయినట్లూ, ఊహిస్తాము. కానీ చదువు రాక, ఉద్యోగం లేక, నిరుద్యోగిగా మిగిలినప్పుడు, అటువంటి ఊహాలు ఉండవు. విద్యార్థి దశలో శిష్యులకు ఎన్నో సందేహాలూ, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. సామాన్యంగా గురువులు వాటిని తీర్చకుండా, వారిపై కోపపడి వారి జిజ్ఞాసపై నీళ్ళు చల్లుతారు. తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పరు. క్రమంగా పిల్లల్లో తెలిసికోవాలనే కోరిక అడుగంటుతుంది. జీవితంలో స్థిరత్వం వచ్చాక, తాను దేవేంద్రలోకంలో అప్సరసల మధ్య ఉన్నట్లు కలలు కనడు – తన నిజ స్థితిని తాను గుర్తిస్తాడు.

ఇ) సృజనాత్మకంగా స్పందించండి.

* పాఠంలోని మొదటిపేరా ఆధారంగా చిత్రాన్ని గీయండి. దాని గురించి వర్ణించండి.

జి. విద్యార్థికృత్యం (లేదా) * మీ పాఠశాలలో ‘ప్రపంచశాంతీ’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ న�

ప్రశ్న 2.
మీ పాఠశాలలో ‘ప్రపంచశాంతి’ అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించాలని అనుకున్నారు. విద్యార్థులను ఆహ్వానిస్తూ కరపత్రం తయారుచేయండి.
జవాబు:

(వ్యాసరచన పోటీ)

కొవ్వూరు మండల విద్యార్థులకు ఒక శుభవార్త. దివి x x x x వ తేదీ సోమవారం, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో “ప్రపంచశాంతి” అనే విషయమై వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ పోటీలో కొవ్వూరు మండలంలోని . ప్రభుత్వ గుర్తింపు గల ఉన్నత పాఠశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చును. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుని వద్ద నుండి గుర్తింపు పత్రం తీసుకురావాలి.

వ్యాసరచనకు సమయం 30 నిమిషాలు ఇవ్వబడుతుంది. వ్యాసాలు రాయడానికి కాగితాలు ఇవ్వబడతాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీ కొవ్వూరు మండల డెవలప్ మెంట్ ఆఫీసరు గారి పర్యవేక్షణలో సాగుతాయి.

వ్యాసరచన విషయం : “ప్రపంచశాంతి”

ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని జయప్రదం చేయగోరిక. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ పోటీని జయప్రదం చేయడానికి సహకారం అందించగోరుతున్నాను.
దివి x x x x x.

మండల డెవలప్ మెంటు ఆఫీసర్,
కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా,

ఈ) ప్రశంసాత్మకంగా రాయండి.

మీ పాఠశాలలో ఒక విద్యార్థి రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీలో పాల్గొని, ముఖ్యమంత్రి చేతులమీదుగా బహుమతినందుకున్నాడు. అతణ్ణి అభినందిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:

అభినందన పత్రం

మిత్రుడు రవికాంత్ కు,
నీవు రాష్ట్రస్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ జంభోరీలో పాల్గొని, మన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఉత్తమ స్కౌటుగా మొదటి బహుమతిని అందుకున్నావని తెలిసింది. ఇది మన పాఠశాల విద్యార్థులందరికీ గర్వకారణము. మన పాఠశాల పేరును నీవు రాష్ట్రస్థాయిలో నిలబెట్టావు. నీకు మన విద్యార్థులందరి తరఫునా నా శుభాకాంక్షలు, అభినందనలు.

నీవు మొదటి నుండి చదువులోనూ, ఆటపాటలలోనూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటున్నావు. ఈ రోజు ఇంత ఉన్నతమైన బహుమతిని అందుకున్నావు. నీవు మన పాఠశాల విద్యార్థులందరికీ ఆదర్శప్రాయుడవు. నీవు సాధించిన ఈ విజయాన్ని మన విద్యార్థినీ విద్యార్థులంతా హార్దికంగా అభినందిస్తున్నారు. నీకు మా అందరి జేజేలు.
ఉంటా.

ఇట్లు,
కె. శ్రీకాంత్ రవివర్మ,
9వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
కాకినాడ.

(లేదా)
మీ జిల్లాలో ఒక విద్యార్థి వ్యర్థంగా పారవేసిన వస్తువులతో అద్భుతంగా కళాఖండాలు తయారుచేశాడు. ఆ వార్తను మీరు పత్రికల్లో చూశారు. అతణ్ణి ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి.
జవాబు:

వాకాడు,
x x x x

కె. రాజా రవివర్మ,
9వ తరగతి,
వాకాడు జిల్లా పరిషత్ హైస్కూలు,
నెల్లూరు జిల్లా,

ఈనాడు పత్రికా సంపాదకులకు,
సోమాజీగూడ, హైదరాబాదు.

ఆర్యా,
ఈ రోజు మీ పత్రికలో మా నెల్లూరు జిల్లా గూడూరు విద్యార్థి కె. రవిరాజు, వీధుల్లో పారవేసే ప్లాస్టిక్ కాగితాలు, బాటరీలు, అగ్గిపెట్టెలు వగైరా వ్యర్థ పదార్థాలతో చార్మినార్, తాజ్ షుహల్ వంటి కళాఖండాల నమూనాలను అద్భుతంగా తయారు చేశాడని చదివాను. ఆ కళాఖండాలను చూసి మా జిల్లా విద్యాశాఖాధికారి గారు, మా కలెక్టరు గారు, స్థానిక మంత్రిగారు ఆ విద్యార్థిని ప్రశంసించినట్లు చదివాను.

రవిరాజులోని కళాతృష్ణనూ, కళాచాతుర్యాన్ని నేను మనసారా ప్రశంసిస్తున్నాను. మా నెల్లూరు జిల్లా విద్యార్థి యొక్క కళాపిపాసనూ, అతనిలోని సృజనాత్మక శక్తినీ నేను మనసారా మెచ్చుకుంటున్నాను. మీ పత్రిక ద్వారా నా అభినందనలను మా సోదరుడు రవిరాజుకు అందజేయండి. భవిష్యత్తులో అతడు ఉత్తమ కళాకారుడు కావాలని నేను కోరుకుంటున్నాను.

ఇట్లు,
కె. రాజా రవివర్మ,
జిల్లా పరిషత్ హైస్కూలు,
వాకాడు.

చిరునామా :
సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

IV. ప్రాజెక్టు పని
* మనచుట్టూ ఉండే ప్రతి ప్రాణిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది. మీరు చూసిన పక్షులు, జంతువుల లక్షణాలను, ప్రత్యేకతలను పట్టిక రూపంలో రాసి ప్రదర్శించండి.

పక్షులు/జంతువులులక్షణాలుప్రత్యేకత
కుక్కవాసన పసిగట్టడంవిశ్వాసము కలది
కోడిగుడ్లు పెట్టుటకోడికూత
ఆవుసాధు జంతువుమచ్చిక చేసిన పాలు ఇస్తుంది.
సింహంక్రూరమైనదిమృగరాజు
ఏనుగుఎత్తైనదిబరువులు ఎత్తుట
పావురంపెంపుడు పక్షిసమాచారం చేరవేయుట

III. భాషాంశాలు
పదజాలం
అ) ఇచ్చిన వాక్యాలు ఆధారంగా కింద గీత గీసిన పదాలకు అర్థాలను గ్రహించి, మరో వాక్యం రాయండి.
1. ఇంద్రధనుస్సులో రంగులను చూస్తే, విస్మయం కలుగుతుంది.
అర్థాలు : ఇంద్రధనుస్సు = హరివిల్లు; విస్మయం = ఆశ్చర్యం
వాక్యప్రయోగం : హరివిల్లు ఆకాశంలో కనబడితే, పిల్లలకు ఆశ్చర్యము కలుగుతుంది.
2. మనం ప్రతిరోజు ప్రాతఃకాలంలో నిద్రలేవాలి.
అర్థం : ప్రాతఃకాలము = తెల్లవారే సమయము.
వాక్యప్రయోగం : పక్షులు తెల్లవారే సమయములో కిలకిలారావములు చేస్తాయి.
3. వెన్నను చేతితో తాకితే మృదువుగా ఉంటుంది.
అర్థం : మృదువు = మెత్తనిది
వాక్యప్రయోగం : పూలు మెత్తగా, సున్నితంగా ఉంటాయి.
4. ప్రవర్తన సరిగా లేనివారు జీవితంలో కష్టాల్లో పడతారు.
అర్థం : ప్రవర్తన = నడవడి
వాక్యప్రయోగం : మనిషి జీవితాన్ని వారి నడవడి నిర్ణయిస్తుంది.
5. ఆదర్శానికి, ఆచరణకు సమన్వయం ఉండడం వాంఛనీయం.
అర్థం : సమన్వయం = సరియైన క్రమము
వాక్యప్రయోగం : ధర్మార్థములకు సరియైన క్రమము అవసరము.

ఆ) కింది వాటిలో ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలున్నాయి. వాటిని వేరుచేసి వాక్యాలు రాయండి.
తనంతట తాను, దురదృష్టం, కాఠిన్యం, తెలుసుకోడం, క్లిష్టం. నిజం చెప్పడం, పలు అసాధారణం, పనిని ఇష్టపడడం, స్వతస్సిద్ధం.
జవాబు:
ఆత్మవిశ్వాసం ప్రకటించడానికి ఉపయోగపడే పదాలు
తనంతట తాను
స్వతస్సిద్ధం
నిజం చెప్పడం
తెలుసుకోడం
పనిని ఇష్టపడడం
వాక్య ప్రయోగాలు :
తనంతట తాను . ఇతరుల సాయం లేకుండానే రవిబాబు తనంతట తానుగా ఆ కార్యం నెరవేర్చాడు.
స్వతస్సిద్ధం గోపాల్ బాబు స్వతస్సిద్ధంగా గొప్ప కార్యసాధకుడు.
నిజం చెప్పడం . ఏమైనా సరే, నిజం చెప్పడం మనిషి కర్తవ్యం అని బాబు నమ్ముతాడు.
తెలుసుకోడం : తన శక్తిని తాను తెలుసుకోడం, కార్యసాధకుని మొదటి లక్షణం.
పనిని ఇష్టపడడం : పనిని ఇష్టపడడం అన్నది యోగ్యుని లక్షణం అని చెప్పాలి.
ఇ) కింది వాక్యాలలో ప్రకృతి పదాలను గుర్తించండి. వాటి ఎదురుగా వికృతులను ఎంపిక చేసుకొని రాయండి.
1) ఆకాశంలో మబ్బులను చూశారా?
జవాబు:
ఆకాశం
2) సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
జవాబు:
ఆహారం
3) నెమలి జాతీయ పక్షి.
జవాబు:
పక్షి
4) ఉపాధ్యాయుడు బడిలో పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్పుతాడు.
జవాబు:
ఉపాధ్యాయుడు

వికృతి పదాలు : ఓగిరం, సంద్రం, పక్కి, దెస, ఒజ్జ, గారవం, ఆకసం, బాస, సాకిరి
జవాబు:
ప్రకృతి – వికృతి
1) ఆకాశం – ఆకసం
2) ఆహారం – ఓగిరం
3) పక్షి – పక్కి
4) ఉపాధ్యాయుడు – ఒజ్జ
వ్యాకరణం
ఈ) కింది వాక్యాన్ని పరిశీలించి, అది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. క్రియా భేదాలను కూడా గుర్తించండి.
1) రమ రోడ్డుమీద ఉన్న ఒక కాగితం ముక్కను తీసి, దగ్గరలో నున్న చెత్తకుండీలో వేసి, మళ్ళీ సైకిలెక్కి వెళ్ళిపోయింది.
అ) సామాన్య
ఆ) సంయుక్త
ఇ) సంక్లిష్ట
జవాబు:
సంక్లిష్ట వాక్యం
పై వాక్యంలో ఉన్న అసమాపక క్రియలను రాయండి.
అసమాపక క్రియలు : 1) తీసి 2) వేసి 3) ఎక్కి అనేవి. ఇవి క్వార్థకములు అనే అసమాపక క్రియలు.
2) ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? అనే పదాలను ఉపయోగించి, ప్రశ్నార్థక వాక్యాలు తయారుచేయవచ్చునని మీకు తెలుసు. వాక్యం చివరలో ‘ఆ’ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నవాక్యంగా మార్చవచ్చు. ఇలాంటి ప్రశ్నావాక్యాలను రకానికి ఒకటి చొప్పున, మీ పాఠ్యపుస్తకం నుంచి ఉదాహరణలు వెతికి రాయండి.
ఉదా : దైన్యస్థితిని చూస్తారు + ఆ = దైన్యస్థితిని చూస్తారా?
జవాబు:
ప్రశ్నార్థక వాక్యాలు :
మీరెప్పుడయినా గమనించారా? (గమనించారు + ఆ)
మీరు గమనిస్తారా? (గమనిస్తారు + ఆ)
వీటిని మీరు చూస్తారా? (చూస్తారు + ఆ)
నిజంగా మీరు చూస్తుంటారా? (చూస్తుంటారు + ఆ)
శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? (తెలుసు + ఆ)
పెద్దవారయిన కొద్దీ పోతుంది. ఎందువల్ల?
పెరుగుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకుంటారు?
ఇంట్ల కెట్ల ఆ పిల్లగాడు వొచ్చిండో? (వొచ్చిండు + ఓ)
పిరికిదనం గల్గియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల జేయగలిగెడి వారేనా? (వారేను + ఆ)
3) ఒక వస్తువు స్వభావాన్ని / ధర్మాన్ని తెలిపే క్రియలను, నిత్య సత్యాలను తెలిపే వాటిని “తద్ధర్మ” క్రియలు అంటారు.
ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఎగురుతుంది మొదలైనవి. ఇలాంటి క్రియలను మీ పాఠంలో వెతికి రాయండి.
జవాబు:
నడుస్తారు, ఉదయిస్తుంది, పారిపోతారు, చూస్తారు, ఊహిస్తారు, గ్రహిస్తారు, చదువుతారు, చేస్తారు మొ||నవి.
ఉ) రుగాగమ సంధి :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు.
గమనిక :
పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి ప్రక్కనున్న ‘ఆ’ అనే శబ్దం పరమైతే అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే ఇలా రుగాగమం ‘5’ వస్తుంది. రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే ‘ఆగమం’ అంటారు.
సూత్రం 1 :
పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) (నామము)
విశేషణం – నామం
మనుమ + ఆలు = మనుమరాలు
బాలింత + ఆలు = బాలింతరాలు
సూత్రం 2 :
కర్మధారయంలో తత్సమపదాలకు ఆలు శబ్దం పరమైతే, పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర . + ఆలు
(ధీర + ఉ + ర్ + ఆలు) = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంత + ఉ + ర్ + ఆలు = గుణవంతురాలు
మరికొన్ని ఉదాహరణలు రాయండి.
1) విద్యావంతురాలు : విద్యావంత + ఉ + ర్ + ఆలు = విద్యావంతురాలు
2) అసాధ్యురాలు : అసాధ్య + ఉ + ర్ + ఆలు = అసాధ్యురాలు
3) పవిత్రురాలు – పవిత్ర + ఉ + ర్ + ఆలు = పవిత్రురాలు
4) ధైర్యవంతురాలు : ధైర్యవంత + ఉ + ర్ + ఆలు = ధైర్యవంతురాలు

చూడడమనే కళ రచయిత పరిచయం

జిడ్డు కృష్ణమూర్తిగారు మే 12, 1895న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో – జన్మించారు. వీరు ఆంగ్లములో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు | చేశారు. కృష్ణమూర్తిగారు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త.
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. అసలైన విప్లవం రావలసినది హృదయపు లోతులలో.
ఆ మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ జిడ్డు కృష్ణమూర్తి విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు.

కఠిన పదాలకు అర్థాలు
సూర్యోదయము (సూర్య + ఉదయము) = సూర్యుడు ఉదయించడం
సూర్యాస్తమయము (సూర్య + అస్తమయము) = సూర్యుడు అస్తమించడం
విస్మయపరచు = ఆశ్చర్యము కలుగజేయు
గమనించు = గ్రహించు
ప్రతిబింబించు= ప్రతిఫలించు
ప్రాతఃకాల భానుడు = ఉదయకాల సూర్యుడు
వెండితునక = వెండి ముక్క
మాలిన్యాన్ని = మురికిని
హీనస్థితి = దారిద్ర్య స్థితి
మన్నన = గౌరవము
కాఠిన్యం = కఠినత్వము
మృదుస్వభావం = మెత్తని స్వభావము
స్పందన = కదలిక
ఆరంభము = ప్రారంభము (మొదలు)
ఆశ్రయము = ఆధారము
ప్రజ్ఞావంతముగా = తెలివి కలవారుగా
హృదయం = మనస్సు
చింత = ఆలోచన
అంతరంగం = హృదయము
నిరుత్సాహం = ఉత్సాహం లేకపోవడం
ప్రతిస్పందించు = తిరిగి కదలడం
గమనించు = గ్రహించడం
క్లిష్టమైన = కఠినమైన
అసాధారణం = విశేషము
ప్రజ్ఞ = తెలివి, అప్పటికప్పుడు పుట్టే ప్రతిభ
ఆప్యాయత = ప్రీతి
లక్ష్యపెట్టు = పట్టించుకొను
లక్ష్యం = శ్రద్ధ (గురి)
సాక్షులు = కంటితో చూచినవారు
అశుభ్రత = శుభ్రత లేకపోవడం
దైన్యాన్ని = దీనత్వాన్ని
చర్య = నడవడి, అనుష్ఠానము
సంఘర్షణ = ఒరపిడి
మిత్రునితో = స్నేహితునితో
ప్రాధాన్యత = ప్రాముఖ్యము
అస్తిత్వం = ఉండడం
స్వతస్సిద్ధంగా = తనంతట తానుగా సిద్ధించినది (సహజంగా)
శ్రవణానందము (శ్రవణ + ఆనందము) = చెవులకు ఆనందము
నిరపేక్ష = అపేక్ష లేకపోవడం (కోరికలేమి)
బెస్తవారు = పడవలను నడిపే, చేపలు పట్టుకొనే వారు
విమర్శ = తఱచి మంచిచెడ్డలను చెప్పడం

You may Also Like